ఏపీలో విద్యార్థులకు శుభవార్త
కజూన్ 12 న విద్యార్థులకు కిట్ల పంపిణీకి నిర్ణయం
కసర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కవిద్యా శాఖ మంత్రి లోకేష్ నిర్ణయం
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో సౌకర్యాల కల్పనతోపాటుగా వారికి అవసరమైన కిట్లను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు జూన్ 12న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరిట కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.. దీని కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో టెక్స్ట్ బుక్స్, వర్క్బుక్లు, డిక్షనరీ, నోట్ బుక్స్, యూనిఫామ్, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఉంటాయి. ఈ మేరకు జిల్లాస్థాయిలో ఈ కిట్ల పంపిణీకి సంబంధించి.. సమగ్రశిక్షా ఏపీసీ అధ్యక్షుడి గా, సీఎంవో కన్వీనర్గా, జీసీడీవో, ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఏఎల్ఎస్సీవోలు సభ్యులుగా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ కమిటీ జిల్లా కేంద్రంతో పాటుగా మండల స్థాయిలో స్టాక్ పాయింట్లను గుర్తించి పర్యవేక్షణ, ఫైల్స్ నిర్వహణ చేయడంతో పాటుగా రోజువారిగా ఆ రిపోర్ట్స్ను
ఉన్నతాధికారులకు పంపాలి.
ఈ కమిటీలతో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.. స్కూల్స్ తెరిచే నాటికి అన్నిరకాల పుస్తకాలు, సామగ్రి అందిస్తామని చెబుతున్నారు అధికారులు. ఎంఈవో-2 మండలస్థాయిలో కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. ‘ఎంఈవో-1, మండల ఇంజినీరు, ఎంఐఎస్ సమన్వయకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్, సీఎంఆర్టీతో సహా మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. కిట్లను మండల స్టాక్ పాయింట్కు చేర్చడం, సరిచూసి రసీదులు అందజేయడం, యాప్లో అప్లోడ్ చేయడం, పాఠశాలకు చేర్చటం, పర్యవేక్షణ, రోజువారీ నివేదికలు, రికార్డుల నిర్వహణ బాధ్యతలు వీరు చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు అధికారులు. ఆ తర్వాత స్కూల్ స్థాయిలో ఉండే కమిటీలో హెడ్మాస్టర్ అద్యక్షుడిగా.. క్లాస్ టీచర్తో పాటుగా మహిళా పోలీస్, పేరెంట్ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధులు, గ్రామ విద్యా సహాయకుడు సభ్యులుగా ఉంటారు. వీరంతా విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేస్తారు. అంతేకాదు ప్రభుత్వం అందిస్తున్న కిట్లోని వస్తువు లపై ఎలాంటి రాజకీయపరమైన రంగులు, పేర్లు ఉండవని గతంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.